దారుణం: చిక్ మంగళూరులో బీజేపీ కార్యదర్శి హత్య
కర్నాటక చిక్మంగళూరులో దారుణం జరిగింది. చిక్మంగళూరు బీజేపీ కార్యదర్శి మొహ్మద్ అన్వర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత రాత్రి తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గౌరీ కెనాల్ వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి కత్తితో నరికారు. అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిన అన్వర్ స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తల హత్య తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారంతా చాలా అనుమానాస్పద స్థితిలో కనిపించారు.ఈ నెల మొదటి వారంలో బెంగాల్లోని ఓ గ్రామంలో చనిపోయిన బీజేపీ కార్యకర్త విద్యుత్ తీగలకు వేలాడుతూ కనిపించాడు. అంతకుముందు పురులియా జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లుగా అనుమానాస్పద స్థితిలో కనిపించాడు.

ఈ మరణాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ కార్యకర్తల మరణాలన్నీ రాజకీయ హత్యలే అని ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న వయసులోనే బీజేపీ కార్యకర్తలు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications