దారుణం: చిక్ మంగళూరులో బీజేపీ కార్యదర్శి హత్య
కర్నాటక చిక్మంగళూరులో దారుణం జరిగింది. చిక్మంగళూరు బీజేపీ కార్యదర్శి మొహ్మద్ అన్వర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత రాత్రి తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గౌరీ కెనాల్ వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి కత్తితో నరికారు. అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిన అన్వర్ స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తల హత్య తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారంతా చాలా అనుమానాస్పద స్థితిలో కనిపించారు.ఈ నెల మొదటి వారంలో బెంగాల్లోని ఓ గ్రామంలో చనిపోయిన బీజేపీ కార్యకర్త విద్యుత్ తీగలకు వేలాడుతూ కనిపించాడు. అంతకుముందు పురులియా జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లుగా అనుమానాస్పద స్థితిలో కనిపించాడు.

ఈ మరణాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ కార్యకర్తల మరణాలన్నీ రాజకీయ హత్యలే అని ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న వయసులోనే బీజేపీ కార్యకర్తలు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications