ప్రేమ పేరుతో వంచించిన టెక్కీ స్నేహితుడు
చెన్నై :ఇద్దరూ పరిచయస్తులే.చిన్న నాటి నుండి స్నేహితులే.ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి మద్య ప్రేమ ఎక్కువ కాలం మనుగడ సాగలేకపోయింది. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని షోలింగవల్లూరులోని ప్రైవేట్ కంపెనీలో సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే మనీష్ అనే యువకుడు తన చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచించాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి తెలిసిన వారు,. ఒకే చోట చదవుకొన్నారు. చివరికి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు.
ఈ పరిచయం కాస్త వారిమద్య ప్రేమకు దారితీసింది. స్నేహితులు కాస్తా ప్రేమికులుగా మారారు. ఈ ప్రేమను అడ్డుపెట్టుకొని ఆమెను మనీష్ శారీరకంగా లోబర్చుకొన్నాడు.ఆమెతో అవసరం తీరిపోయిందని భావించిన తర్వాత వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్దమయ్యాడు.కొంతకాలంగా ఆ యువతి మనీష్ కు ఫోన్ చేస్తోన్న స్పందించడం లేదు.
మరో యువతితో మనీష్ వివాహానికి సిద్దమైన విషయం తెలుసుకొన్న ఆ ప్రేమికురాలు మనీష్ పై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.చిన్న నాటి స్నేహితుడే కద అని చనువిస్తే తనను మోసం చేసే వరకు తెలుసుకోలేకపోయాయని భాదితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.