Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ క్షిపణి ప్రయోగ వేళ.. హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌక కలకలం

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని భారత్ ప్రయోగించేందుకు సిద్ధమైన వేళ.. చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశం కలకలం రేపుతోంది. చైనా గూఢచారి నౌక 'యువాన్ వాంగ్ 5'లో ట్రాకింగ్, నిఘా పరికరాలను కలిగి ఉన్నట్లు తెలిసింది.

చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ గూఢచారి నౌక కదలికలను భారత నావికాదళం నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది. అయితే, ఓడ కార్యకలాపాలపై అధికారిక ధృవీకరణ లేదు.

 China Spy Ship Spotted In Indian Ocean Region Ahead of Indias Missile Test: Report

ఇదే నౌక ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయంలోకి వచ్చి భారతదేశం, ద్వీప దేశం మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. చైనా పరిశోధనా నౌక 'యువాన్ వాంగ్ 5' భారత సైనిక స్థావరాలపై స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని భారతదేశం పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది.

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ సోమవారం ట్వీట్ చేశారు. "యువాన్ వాంగ్ 5, చైనా క్షిపణి, ఉపగ్రహ ట్రాకింగ్ నౌక ఇండియన్ ఓషన్ ప్రాంతంలోకి ప్రవేశించింది' అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ప్రకారం, బంగాళాఖాతంలో క్షిపణి పరీక్ష గురించి భారతదేశం ఇటీవల నోటమ్ (ఎయిర్‌మెన్‌లకు నోటీసు/ఎయిర్ మిషన్‌లకు నోటీసు) జారీ చేసింది. అయితే, ఈ ప్రాంతంలో చైనా ఓడ ఉండటంతో, క్షిపణి పరీక్షకు భారత్ ముందుకు వెళ్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.

చైనా గూఢచారి నౌక చివరిసారిగా ఇండోనేషియాలోని సుండా జలసంధిలో కనిపించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా ఓడ ప్రవేశించడం చైనా సైనిక, పరిశోధన నౌకల ద్వారా ఈ ప్రాంతంలోకి పెరుగుతున్న చొరబాట్లు ఆందోళనలను మరింత పెంచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+