ట్రంప్కు చైనా వార్నింగ్: అమెరికా ఆ పని చేస్తే.. ఇక వాణిజ్య యుద్దమే!
చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.
బీజింగ్: అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం చెలరేగే దిశగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు నెలకొన్నాయి. తమ టెక్నాలజీని, మేథో సంపత్తిని చైనా చోరీ చేస్తుందని అమెరికా అనుమానిస్తుండటంతో ఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై అది ప్రభావం చూపనుంది.
ఈ వ్యవహారంపై చైనా మీడియాలో ఆ దేశ ఆర్థిక నిపుణుడు మై జిన్ యూ ఒకరు ఘాటుగా స్పందించారు. చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.

అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకార సంస్థకు చెందిన అధికారి అయిన మై జిన్.. చైనా డైలీ పత్రికలో ఈ వివాదంపై వ్యాసం రాశారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని చైనా చోరీ చేసిందంటూ వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్-301 ప్రకారం ట్రంప్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలకడగా ఉన్నాయని, ట్రంప్ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంటే అది వాణిజ్య యుద్దాన్ని ప్రేరేపించడమే అవుతుందని అన్నారు.
-
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications