దొంగతో మహిళా ఎస్సై పోరు, రైల్లో నుంచి కిందపడింది
భోపాల్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఓ దొంగతో పర్సు కోసం పోరాడే క్రమంలో రైలు కింద పడిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన గుణ జిల్లాలోని రైల్వే స్టేషన్లో జరిగిందని సోమవారం నాడు పోలీసులు తెలిపారు.
సుమన్ దాగర్ అనే మహిళ ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఆమె అజ్మీర్ నుంచి జబల్పూర్కు రైల్లో బయలుదేరారు. రుతియాల్ జంక్షన్ వద్ద దాగర్ తన బ్యాగ్, ఇతర వస్తువులను తీసుకుని రైలు దిగేందుకు తలుపు వద్దకు చేరుకున్నారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమె పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మహిళా ఎస్సై అతడి నుంచి దానిని తిరిగి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప పెనుగులాట జరిగింది. ఆమె ఒక్కసారిగా రైలు నుంచి కిందపడ్డారు.
ఇదే అదునుగా భావించిన దొంగ పర్సుతో పరారయ్యాడు. రైలు నుంచి కిందపడిన సుమన్ దాగర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. పర్సులో రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, విలువైన పత్రాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications