బీజేపీ వర్సెస్ ఎస్పీ - అయోధ్యలో రాళ్ల దాడి : చెదరగొట్టిన పోలీసులు..!!
ఉత్తర ప్రదేశ్ లో రేపు (ఆదివారం) మూడో విడత పోలింగ్ జరగనుంది. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రెండు విడత ఎన్నికల పైన ప్రధానంగా బీజేపీ -ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నాయి. 403 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల పోలింగ్ అనంతరం మార్చి 10 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్ఐఎమ్ కూడా గట్టి పోటీ ఇస్తోంది.
ఎన్నికల ప్రచారం సైతం హోరా హోరీగా సాగుతోంది. ఈ ప్రచార క్రమంలో అయోధ్యలో బీజేపీ ..సమాజ్ వాదీ పార్టీ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. రాళ్లు రువ్వుకున్నారు. గోసాయీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్పుర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసు స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. కాల్పులు సైతం జరిగినట్లు తెలుస్తోంది.
గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని భాజపా, ఎస్పీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, భాజపా తరఫున ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారి ఖబ్బూ సతీమణి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు.
UP | During the campaigning, supporters of both the candidates came face to face near Kabirpur intersection of Maharajganj PS area. Both sides have accused each other of stone-pelting & firing: SSP Shailesh Pandey on alleged clash b/w supporters of SP-BJP candidates in Ayodhya pic.twitter.com/6TPETE2vsI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022

ప్రచారంలో భాగంగా రెండు వర్గాలకు చెందిన కార్లు ఎదురుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో..ఒక పార్టీ పై మరో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తమపై దాడి చేసిన బీజేపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్పైనా రాళ్లు విసిరారు.
దీంతో బలగాలను ఉపయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. దీని పైన పోలీసు అధికారులు స్పందించారు. ఈ ఘర్షణలో నాలుగు వాహనాలు ధ్వంసం అయినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని... ఘటన పైప పూర్తి సమాచారంతో విచారణ కొనసాగిస్తామని ప్రకటించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications