ఇక హర్యానాలో ఘర్షణలు: రాళ్ల దాడులు- కాల్పులు
చండీగఢ్: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో తాజాగా దాడులు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు సంభవించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలకు పాల్పడిన చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. విశ్వహిందూ పరిషత్- మాతృశక్తి దుర్గా వాహిణి సంయుక్తంగా నిర్వహించిన బ్రిజ్ మండల్ మేవాత్ శోభాయాత్ర సందర్భంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నూహ్ జిల్లా మేవాత్లోని ప్రఖ్యాత నల్హర్ మహదేవ్ ఆలయం మీదుగా ఈ శోభాయాత్ర సాగుతున్నప్పుడు మరో వర్గం వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఇద్దరు ముస్లిం యువకులు నాజిర్, జునైద్ను సజీవ దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న గో సంరక్షకుడు మోనూ మనేసర్ ఈ శోభాయాత్రలో పాల్గొనాల్సి ఉండటం మరో వర్గానికి ఆగ్రహావేశాలను కలిగించిందని చెబుతున్నారు. నల్హర్ మహదేశ్ ఆలయం వద్ద ఈ శోభాయాత్రను ఉద్దేశించి మోనూ మనేసర్ ప్రసంగించాల్సి ఉంది.
తిరంగా పార్క్ సమీపంలోకి రాగానే ఈ శోభాయాత్రపై ఒక వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వారు. వీహెచ్పీ- మాతృశక్తి దుర్గా వాహిణి ప్రతినిధులు ఈ దాడిని తిప్పి కొట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులపైనా వాళ్లు రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు.
#WATCH | Clashes erupt between two groups in Haryana's Nuh
— ANI (@ANI) July 31, 2023
Further details awaited pic.twitter.com/huZVBzjK4d
పరిస్థితులు అదుపు తప్పడంతో పారా మిలటరీ బలగాలను పంపించారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఈ ఘటన తరువాత నుహ్-హోడల్ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. నుహ్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అల్లర్లు సంభవించినట్లు తెలియగానే ప్రజలు దుకాణాలను మూసివేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఓఎస్డీ జవహర్ యాదవ్ మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications