బొగ్గు కుంభకోణం: స్టే విధించిన సుప్రీం, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్కు తాత్కాలిక ఊరట లభించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లపై దేశ అత్యున్నత న్యాయస్ధానం స్టే విధించింది. దీంతో పాటు మన్మోహాన్ సింగ్ పిటిషన్పై మూడు వారాల్గోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపిన బొగ్గు కుంభకోణంలో కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ విచారణకు హాజరు కావాలని సీబీఐ ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహాన్ సింగ్ సుప్రీం కోర్టునిు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు స్టే విధించింది. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్, డి. భట్టాచార్య, హిందాల్కో సంస్ధకు ఊరట లభించింది.
ఒరిస్సాలోని తలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 8న విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. దీనిపై తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications