వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

College girl: కూతుర్ని రేప్ చేసి రెండు పార్టీల లీడర్స్ కు దానం చేసిన తండ్రి, 28 మందితో, అరెస్టు !

|
Google Oneindia TeluguNews

లక్నో/ లలిత్ పూర్: భార్య, కూతురు, కుమారుడితో కలిసి జీవిస్తున్న వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. పీకలదాక మద్యం సేవిస్తున్న తండ్రికి రాజకీయ నాయకులతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. కూతురు ఆరో తరగతి చదువుతున్న సమయంలో మద్యం మత్తులో ఆమె మీద కన్నతండ్రి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి పదేపదే కూతురి మీద అత్యాచారం చేస్తూ వచ్చాడు. వ్యాపారం పనుల మీద రెండు ప్రముఖ పార్టీల నాయకులు అతని ఇంటికి వెళ్లేవారు. వ్యాపారంలో డబ్బు సంపాధించాలనే ఆశతో కన్న తండ్రి రెండు రాజకీయ పార్టీల నాయకులకు అతని కూతురిని పణంగా పెట్టి డబ్బు సంపాధిస్తున్నాడు. 11వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి మీద రెండు ప్రమఖ పార్టీలకు చెందిన నాయకులు, వారి సోదరులు, కుటుంబ సభ్యులు మొత్తం 28 మంది అత్యాచారం చేశారు. బాధితురాలు విసిగిపోయి పోలీసులను ఆశ్రయించడం, కేసు నమోదు చేసిన పోలీసులు 28 మంది కామాంధులను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

Lady teacher: రసగుల్లా మేడమ్, 15 ఏళ్ల స్టూడెంట్, 41 ఏళ్ల లేడీ టీచర్, ఇంట్లో ?, 8 నెలల గర్బవతి!Lady teacher: రసగుల్లా మేడమ్, 15 ఏళ్ల స్టూడెంట్, 41 ఏళ్ల లేడీ టీచర్, ఇంట్లో ?, 8 నెలల గర్బవతి!

 తండ్రి, ఆయన ఫ్రెండ్స్ రేప్ చేశారు

తండ్రి, ఆయన ఫ్రెండ్స్ రేప్ చేశారు

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. తన మీద తన తండ్రితో పాటు 28 మంది అత్యాచారం చేశారని కాలేజ్ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో అందరూ షాక్ అయ్యారు. తన తండ్రి పదేపదే తన మీద అత్యాచారం చేస్తున్నాడని స్వయంగా అతని కూతురు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

6 తరగతిలోనే అత్యాచారం చేస్తున్న తండ్రి

6 తరగతిలోనే అత్యాచారం చేస్తున్న తండ్రి

తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో తన తల్లి బయటకు వెళ్లిందని, ఇంట్లో ఉన్న తన మీద మొదటిసారి తన తండ్రి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అప్పటి నుంచి తనను బెదిరిస్తున్న తన తండ్రి ఇంట్లో ఒంటరిగా చిక్కినప్పుడు తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

వ్యాపారం పనుల మీద బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులు మా ఇంటికి వచ్చి వెలుతున్నారని అమ్మాయి పోలీసులకు చెప్పింది. వ్యాపారంలో డబ్బు సంపాధించాలనే ఆశతో కన్న తండ్రి బీజేపీ, బీఎస్పీ రాజకీయ పార్టీల నాయకులకు తనను పణంగా పెట్టాడని, తనను గదిలోకి పంపించి వారితో అత్యాచారం చేయించి మా నాన్న డబ్బు సంపాధిస్తున్నాడని అమ్మాయి చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 పేర్లతో సహా చెప్పిన బాధితురాలు

పేర్లతో సహా చెప్పిన బాధితురాలు

బీజేపీ లలిత్ పూర్ జిల్లా అధ్యక్షుడు దీపక్ అహిర్వార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నీరజ్ తివారి, వీరి సోదరులు తన మీద పదేపదే అత్యాచారం చేశారని బాధితురాలు వారి పేర్లతో సహా పోలీసులకు చెప్పింది. ఇప్పటి వరకు తన తండ్రి అండ చూసుకుని తన మీద 28 మంది అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

Recommended Video

Engineering Courses In 5 Local Languages - PM Modi | Oneindia Telugu
 మా అమ్మాను చంపేస్తానని బెదిరించారు

మా అమ్మాను చంపేస్తానని బెదిరించారు

తన మీద అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే తన తల్లిని చంపేస్తామని ఇంతకాలం బెదిరించారని, అందుకే ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని, రానురాను తన తండ్రి ఆగడాలు ఎక్కువ కావడంతో ధైర్యం చేసి కేసు పెట్టడానికి వచ్చానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. 11వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి మీద బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు, వారి సోదరులు, కుటుంబ సభ్యులు మొత్తం 28 మంది అత్యాచారం చేశారని కేసు నమోదు చేశామని లలీత్ పూర్ ఏఎస్పీ గిరిజేష్ కుమార్ స్పష్టం చేశారు. బాధితురాలు విసిగిపోయి పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు కేసు నమోదు చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

English summary
College girl: The Uttar Pradesh Police arrested 28 people for allegedly raping a Class 11 student in the state's Lalitpur district. The father of the victim, the Samajwadi Party (SP) district president and Bharatiya Janata Party (BSP) district president are among the 28 accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X