గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! లెక్కలతో సహా..!
కొత్త ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం వాణిజ్య గ్యాస్ (LPG) వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సిలెండర్ పై ఏకంగా 195 రూపాయల వరకూ పెంచేసింది. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇళ్లకు వాడే డొమిస్టిక్ గ్యాస్ సిలెండర్లు, చమురు ధరల్ని మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో తర్వాత పెరిగేది ఈ ధరలే అన్న ఆందోళన వినియోగదారుల్లో మొదలైంది. దీనిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలపై నియంత్రణ లేదని, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటిపై నిర్ణయాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. వీటిని సాధారణంగా నెలవారీగా సవరిస్తారని పేర్కొంది. దేశంలో వినియోగించే మొత్తం ఎల్పిజిలో వీటి వినియోగం 10% కంటే తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ ఎల్పిజి సరఫరాలలో 20-30% హార్ముజ్ జలసంధిలో నిలిచిపోవడం వల్ల, సౌదీ కాంట్రాక్ట్ ధర మార్చిలో $542/MT నుండి ఏప్రిల్లో $780/MTకి 44% పెరగడంతో, ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్ ధర పెరిగిందని స్పష్టం చేసింది.

అయితే ఇళ్లకు వాడే గ్యాస్ సిలెండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. 14.2 కేజీల సిలిండర్ రూ.913కే కొనసాగుతుందని, అలాగే పీఎం ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు రూ.613కే సిలెండర్లు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే. చమురు కంపెనీలు ఒక్కో సిలిండర్పై రూ.380 తక్కువ వసూలు చేస్తున్నాయని వెల్లడించింది. దీంతో మే నెలాఖరు నాటికి వాటి నష్టాలు రూ.40,484 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది. గతేడాది కూడా అధిక అంతర్జాతీయ ఎల్పిజి ధరల నుండి ప్రజల్ని కాపాడటానికి మొత్తం రూ.60వేల కోట్ల నష్టాలలో.. రూ.30వేల కోట్లను చమురు ప్రభుత్వ రంగ సంస్థలు, మరో రూ.30వేల కోట్లను ప్రభుత్వం భరించినట్లు తెలిపింది.

పాకిస్తాన్తో (రూ.1,046), శ్రీలంకతో (రూ.1,242), నేపాల్తో (రూ.1,208) పోలిస్తే భారతదేశ దేశీయ ఎల్పిజి ధర ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. అలాగే సాధారణ పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరలు ఢిల్లీలో యథాతథంగా ఉన్నాయని, లీటరుకు రూ. 94.77, రూ. 87.67 వద్ద ఉన్నాయని కేంద్రం తెలిపింది. గత నెలలో ప్రపంచ పెట్రోలియం ధరలు 100% వరకు పెరగడంతో ఏప్రిల్ 1 నాటికి ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్పై లీటరుకు రూ.24.40, డీజిల్పై లీటరుకు రూ.104.99 నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపింది. తాజాగా లీటరుకు రూ.2 చొప్పున చేసిన పెంపు కేవలం ప్రీమియం పెట్రోల్ వేరియంట్లకు - XP95, Power95, Speedకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
-
చిన్న సిలిండర్ల రేట్లూ భగ్గు: విమాన ఛార్జీలకు రెక్కలు -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!














Click it and Unblock the Notifications