చర్యలు తీసుకోండి: సచిన్ గిర్ పర్యటనపై ఈసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గిర్ అభయారణ్య పర్యటన పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. గత నెల మార్చి 22న సచిన్ టెండుల్కర్ గిర్ అభయారణ్య పర్యటనకు వచ్చినప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.
జునాగఢ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్తల అసోసియేషన్ ఈ ఫిర్యాదు చేసింది. గత నెలలో సచిన్ గిర్ అభయారణ్య పర్యటన సమయంలో ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

మార్చి 22న సచిన్, ఆయన కుటుంబ సభ్యులు గిర్ అభయారణ్యానికి వచ్చినప్పుడు ఫారెస్టు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని సదరు కార్యకర్తల అసోసియేషన్ చెబుతోంది. అందుకే తాము ఫిర్యాదు చేశామన్నారు.
వారు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించారని, అంతేకాకుండా గిర్ పులుల సంరక్షణ కేంద్రంలో నిర్దిష్ట సమయం కంటే వారు ఎక్కువ సేపు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.
కాగా, తమకు ఫిర్యాదు అందిందని అయితే, సచిన్తో కలిసి ఉన్న ఫారెస్టు అధికారులకు ఎలాంటి పోలింగ్ డ్యూటీ ఇవ్వలేదని జునాగఢ్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అలోక్ కుమార్ పాండే చెప్పారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications