క్రికెట్ తర్వాత: సచిన్పై కాంగ్రెస్ కన్ను, ఒప్పించేందుకు..
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి దించడంపై కాంగ్రెసు దృష్టి సారించిందని అంటున్నారు.

ఈ మేరకు మధ్యప్రదేశ్ 'ఎన్నికల టెస్ట్'లో పార్టీకి సారథ్యం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా జట్టులోకి 'ప్రజాకర్షక ప్రచారకర్త' (స్టార్ క్యాంపెయినర్)గా ఎంపిక చేసిందని సమాచారం. దీనిపై సింధియా ఆయనతో చర్చించి ఒప్పిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయట.
ప్రముఖ పౌరుల కోటాలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టినందున ఇందుకు కాదనబోరని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోందంటున్నారు. మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో ముఠా కుమ్ములాటలతో కునారిల్లుతున్న పార్టీని ఏకతాటిపై నడపడంలో సచిన్ ప్రజాకర్షక శక్తి ఇతోధికంగా తోడ్పడుతుందని అధిష్ఠానం భావిస్తోందట. కాగా, సచిన్ టెండుల్కర్, రేఖలను కొద్ది నెలల క్రితం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications