కేరళ వరదలు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భేటీ, ధైర్యంగా ఉండాలి, రెండు రోజులు!
తిరువనంతపురం: కేరళలోని వరద బాధిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. కేరళలోని చెంగన్నూర్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం రాహుల్ గాంధీ సందర్శించారు.
ఈ సందర్బంగా వరద బాధితులకు అందుతున్న సహాయం గురించి అక్కడి అధికారులను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ వారికి ధైర్యం చెప్పారు. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ కేరళలో పర్యటించనున్నారు.

ఈ సందర్బంగా కేరళలోని అనేక పునరావాస కేంద్రాలకు రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. వరద బాధితులను సకాలంలో ఆదుకుని వారి ప్రాణాలను రక్షించిన చేపలు పట్టేవారు, రక్షాణ సిబ్బంది, పలు సంఘ సంస్థలతో రాహుల్ గాంధీ చర్చించి వారికి కృతజ్ఞతలు చెబుతారని కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
రాహుల్ గాంధీ ఆగస్టు 24వ తేదీన కేరళలో పర్యటించవలసి ఉంది. అయితే రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సందర్బంగా కేరళ పర్యటన వాయిదా పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్ కేరళలో పర్యటించి వరదల వలన ఎంత నష్టం జరిగింది అని పరిశీలించారు. పలు పార్టీల నాయకులు కేరళ చేరుకుని పునరావాస కేంద్రాలలో ఉంటున్న వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications