సజ్జన్ మెడకు సిక్కుల ఊచకోత కేసు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై
ఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిరూపితమైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సజ్జన్ కుమార్ పార్టీకి దూరమయ్యారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి లేఖ పంపించారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ ను దోషిగా ప్రకటిస్తూ సోమవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయనను దోషిగా తేలుస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
1984 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సిక్కు మతస్థులైన బాడీగార్డ్స్ కాల్చి చంపడంతో.. దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో ఢిల్లీలోని రాజ్ నగర్ ఏరియాలో ఐదుగురు సిక్కులను చంపేశారు. అప్పుడు సజ్జన్ కుమార్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయితే సిక్కుల ఊచకోతకు సంబంధించిన కేసులో ఆయనతో పాటు మరో ఆరుగురు నిందితులున్నారు.

2013 సంవత్సరంలో సజ్జన్ కుమార్ నిర్దోషిగా బయటపడినప్పటికీ.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. దీంతో విచారణ మొదలుపెట్టిన న్యాయస్థానం సజ్జన్ కుమార్ ముమ్మాటికీ దోషియేనంటూ తీర్పు వెలువరించింది. అయితే నేరం రుజువు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు సజ్జన్ కుమార్.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications