ముస్లిం మహిళలకు కాంగ్రెస్,ఎస్పీ చేసిందేమీలేదు; బీజేపీతోనే ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి: పీఎం మోడీ
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గత ప్రభుత్వాలు ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం మహిళల దుస్థితిని విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోడీ గత కాంగ్రెస్-ఎస్పీ ప్రభుత్వాలపై దాడి చేశారు.
ప్రత్యర్థి పార్టీల నాయకులు తమ ఓట్ల కోసం ముస్లిం ఆడపిల్లల జీవితంలో అతిపెద్ద సమస్యను విస్మరించారు అని బుధవారం బారాబంకి జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు. ముస్లిం మహిళల జీవితాల్లో ఉన్న కష్టాలను పట్టించుకోలేదని, ముస్లిం సోదరీ మణులకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి చేసింది మా ప్రభుత్వమే అని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆదివారం బారాబంకిలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటర్లకు, ముఖ్యంగా మహిళలకు బలమైన నియోజకవర్గమైన బారాబంకి లో ముస్లిం మహిళల శ్రేయస్సుకోసం బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు.

బిజెపి 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం ముస్లిం మహిళల భద్రత మరియు గౌరవాన్ని కాపాడిందని అన్నారు. 2014లో మాకు అవకాశం ఇచ్చినప్పుడు, మేము దాని కోసం చిత్తశుద్ధితో పనిచేశామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య 1.1 లక్షల నుంచి 2.25 లక్షలకు పెరగడం మహిళా రక్షణపై బిజెపి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన జన్ధన్ యోజన, ఉజ్వల వంటగ్యాస్ సిలిండర్ కార్యక్రమం వంటి వాటి ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు.
యూపీ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది చిన్న రైతులకు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగు చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో సాగు చట్టాలను రద్దు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతుల కోసం, మహిళల కోసం చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధికి పట్టం కడుతూ బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications