నేతాజీకి భారతరత్నపై పరిశీలించండి: మద్రాస్ హైకోర్టు
చెన్నై: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న, ఆయన జయంతి రోజున సెలవు ప్రకటించడంపై పరిశీలించాలని కేంద్ర హోంశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న ప్రదానం చేయడంతోపాటు ఆయన జయంతి రోజు జనవరి 23న సెలవు ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కేంద్రం నిర్వాహకుడు కేకే రమేశ్ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలుచేశారు.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ఎమ్ సుదర్శన్, జస్టిస్ ఎస్ విమలతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాజ్యాన్ని విచారించింది. ‘ప్రతి భారతీయుడు నేతాజీకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ మహనీయుడి త్యాగాన్ని ఎవరు మరిచిపోలేరు' అని విచారణ సందర్భంగా రమేశ్ తెలిపారు.
అంతేగాక, జనవరి 27న ఈ విషయాలను తెలుపుతూ హోంశాఖ కార్యదర్శికి నివేదించానని కూడా వివరించారు. ‘ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిశీలించాలి. అయితే మేం ఈ కేసులో మంచి చెడ్డలపై పరిశీలన చేయదల్చుకోలేదు' అని ధర్మాసనం తెలిపింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications