మిని స్కర్ట్ రాధే మాకు మళ్లీ కష్టాలు వచ్చాయి
ముంబై/హర్యానా: ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు మళ్లీ కష్టాలు వచ్చాయి. ఇప్పటికే వరకట్నం వేధింపుల కేసుతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కోంటున్న రాధే మా విషయంలో మరో కేసు విచారణకు రంగం సిద్దం అయ్యింది.
మూడు నెలలలోపు విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని హర్యానా హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ లోని ఫగ్వార ప్రాంతానికి చెందిన సురేంద్ర మిత్తల్ అనే వ్యక్తి హర్యానా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా మీద ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని, కేసులు నమోదు అయ్యాయని ఆయన కోర్టులో మనవి చేశారు. ఈ కేసుల విచారణ ఇంకా పూర్తి కాలేదని అన్నారు.

అయితే రాధే మా తాను దుర్గాదేవి అవతారం అంటూ దేవుడికి వేసే దస్తులు ధరించి అధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. చేతిలో త్రిశూలం పెట్టుకుని భక్తులను మాయ చేస్తున్నారని చెప్పారు.
వివరాలు తెలుసుకున్న హర్యానా హైకోర్టు మూడు నెలల్లలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కపుర్థాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాధే మా ఇప్పటికే బాంబే హైకోర్టులో బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు మరో కేసు విచారణ మొదలైయ్యింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications