వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటో: బాబు దీక్షలో రక్తం మరిగిన రాక్షసిగా సోనియా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిరవధిక నిరాహార దీక్షా శిబిరంలో అత్యంత వివాదాస్పదమైన పోస్టర్ దర్శనమిచ్చింది. రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఎపి భవన్‌లో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని అత్యంత నీచంగా చిత్రీకరించిన పోస్టరును ప్రదర్శించారు.

బుధవారంనాడు చంద్రబాబు నాయుడి దీక్షా శిబిరంలో ఆ పోస్టర్ కనిపించింది. సోనియా నోటి నుంచి రక్తం కారుతున్నట్లుగా చిత్రం ఉంది. ఆమె మెడలో కేంద్ర మంత్రులు, కాంగ్రెసు నేతల తలలతో కూడిన గొలుసును వేలాడదీసుకున్నట్లుగా చిత్రీకరించారు.

Controversial posters of Sonia Gandhi create stir in Delhi

పోస్టర్‌పైన సోనియా డౌన్ డౌన్, యుపిఎ డౌన్ డౌన్ అనే నినాదం రాశారు. రాష్ట్ర విభజనకు సోనియా గాంధీ ఒడిగట్టే విషయంలో రాక్షసత్వం ప్రదర్శించడానికి చెప్పడానికి ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.

సోనియా గాంధీ చిత్రాన్ని అసభ్యంగా ప్రదర్శిస్తూ వేసిన చాలా పోస్టర్లను తీసేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ మాత్రం ఢిల్లీ పోలీసుల బారికేడ్లపై బుధవారంనాడు కనిపించింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్ష గురువారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆయన సోమవారంనాడు దీక్షను ప్రారంభించారు.

English summary
In what can be described as "cheap political gimmick", the controversial posters of the UPA chairperson Sonia Gandhi along with other senior ministers of Congress party have been put up at the camp where the Telugu Desam Party (TDP) chief Chandrababu Naidu is on an indefinite fast against the creation of separate state of Telangana out of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X