మరో ఉగ్ర ఘాతుకం: పోలీసును కిడ్నాప్ చేసి, కాల్చి చంపేశారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. జావేద్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ను గురువారం రాత్రి షోపియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన ఉగ్రవాదులు.. ఆయనను తుపాకులతో కాల్చి దారుణంగా హత్యచేశారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రాకు వ్యక్తిగత భద్రత కోసం నియమించిన జావేద్ను కచ్దూరా గ్రామంలోని ఆయన ఇంటి నుంచి గురువారం రాత్రి సాయుధులైన ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.

ఉగ్రవాదులు జావేద్ను తలలో కాల్చి చంపేశారని పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని సెహ్పొరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభించినట్లు తెలిపారు. కచ్దూరా గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్లో భద్రతాసిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు కానిస్టేబుల్ను అపహరించి చంపేసినట్లు తెలుస్తోంది.
కాగా, జూన్ నెలలో పుల్వామా జిల్లాలో ఔరంగజేబు అనే సైనికుడిని కూడా ఉగ్రవాదులు అపహరించి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని హత్య చేశారు ఉగ్రవాదులు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications