2022 రిపబ్లిక్ డే వేడుకలకు కరోనా ఎఫెక్ట్: 24వేల మందికే అనుమతి; ఏర్పాట్లు ఇలా
దేశ రాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే అరగంట ఆలస్యంగా రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం కానుంది. జనవరి 26న పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, మెరుగైన ఈ విధంగా గణతంత్ర వేడుకల్లో వీక్షించడం కోసం పరేడ్ ఉదయం 10 గంటలకు బదులుగా 10.30 గంటలకు ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

రిపబ్లిక్ డే పరేడ్ ఉదయం 10.30 గంటలకు.. అరగంట ఆలస్యంగా.. కారణం ఇదే
పరేడ్లో ప్రేక్షకులకు మెరుగైన వీక్షణ అనుభవం కోసం పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభించే నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పొగమంచు ఉదయం ఉంటుందని అంచనా వేస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను చూడడం కోసం 10 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు - రాజ్పథ్కు ప్రతి వైపు ఐదు - అమర్చబడతాయి అని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మునుపటి రిపబ్లిక్ డే పరేడ్ల ఫుటేజీని కలిపి క్యూరేటెడ్ ఫిల్మ్లు, సాయుధ దళాలపై షార్ట్ ఫిల్మ్లు మరియు 2022 రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే వివిధ ఈవెంట్లకు సంబంధించిన కథనాలు పరేడ్ ప్రారంభమయ్యే ముందు ప్రదర్శించబడతాయని పేర్కొంది. తరువాత, స్క్రీన్లు రిపబ్లిక్ డే పెరేడ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

కరోనా కారణంగా 24,000 మందికే అనుమతి
కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం అతిథి జాబితా మరియు పరేడ్ తగ్గించబడ్డాయని సమాచారం. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితి కారణంగా ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్కు సుమారు 24,000 మందిని అనుమతించనున్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ కు హాజరయ్యే సుమారు 24,000 మందిలో 19,000 మందిని ఆహ్వానించారు మరియు మిగిలిన వారు టిక్కెట్లు కొనుగోలు చెయ్యాలని వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం కూడా, కోవిడ్ మహమ్మారి మధ్య పరేడ్ జరిగింది మరియు దాదాపు 25,000 మంది ప్రజలు దీనికి హాజరు కావడానికి అనుమతించబడ్డారు.

2020 పరేడ్లో, సుమారు 1.25 లక్షల మంది
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు, 2020 పరేడ్లో, సుమారు 1.25 లక్షల మందిని అనుమతించారు. వరుసగా రెండో ఏడాది కూడా రిపబ్లిక్ డే పెరేడ్ కు ముఖ్య అతిథులుగా విదేశీ ప్రముఖులెవరూ రాకపోవచ్చునని భావిస్తున్నారు. జనవరి 26న, దేశాన్ని రక్షించడంలో అసువులు బాసిన వీరుల అత్యున్నత త్యాగాలను గౌరవించేందుకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) 'షాహీదోన్ కో షట్ షత్ నమన్' దేశవ్యాప్తంగా ప్రారంభించబడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనికులకు నివాళులర్పించిన సమయంలోనే దాదాపు 5,000 మంది మరణించిన వీరుల కుటుంబానికి దేశవ్యాప్తంగా నేషనల్ క్యాడెట్ కార్ప్ సభ్యులు కృతజ్ఞతా ఫలకాన్ని అందజేస్తారు.

75వ సంవత్సరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్గా రిపబ్లిక్ డే వేడుకలు
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్గా జరుపుకుంటారు. జనవరి 26న రాజ్పథ్లో జరిగే ప్రధాన రిపబ్లిక్ డే పెరేడ్ లో మరియు జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు. వేడుక ముగింపును సూచించే సాంప్రదాయ ఫ్లై-పాస్ట్లో 75 విమానాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వింటేజ్తో పాటు రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలను ప్రదర్శించనున్నారు. ఫ్లై-పాస్ట్ లో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాలను ప్రదర్శిస్తారు.

రిపబ్లిక్ డే వేడుకలకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత
పరేడ్కు కొద్ది రోజుల ముందు ఘాజీపూర్ పూల మార్కెట్లో బాంబును కనుగొని నిర్వీర్యం చేయడంతో భద్రతా సంస్థలు రాజ్పథ్ చుట్టుపక్కల ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఈ ప్రాంతంలోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లతో కూడిన 300 సీసీటీవీలను ఏర్పాటు చేశామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం, రిపబ్లిక్ డే పరేడ్ కొత్త రూపాన్ని కలిగిన సెంట్రల్ విస్టాలో మొదటిసారిగా బ్రిటీష్-నిర్మిత ఢిల్లీలోని ఐకానిక్ భాగానికి మార్పులతో నిర్వహించబడుతుంది. భారతదేశ సైనిక శక్తి మరియు సంస్కృతికి సంబంధించిన రిపబ్లిక్ డే జనవరి 26 ప్రదర్శన కోసం ఉత్సవ రహదారి రాజ్పథ్ను పాక్షికంగా సిద్ధం చేయడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది.












Click it and Unblock the Notifications