బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్ .. ఎయిమ్స్ లో చేరిక .. ప్రచారానికి దూరం
ఒకపక్క బీహార్లో ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టోలు,ప్రజలకు ఇస్తున్న హామీలతో ప్రధాన పార్టీలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాయి. బిజెపి, మహా కూటమి పార్టీల మధ్య ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా వైరస్ బారిన పడ్డారు. బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ గురువారం కరోనా బారిన పడినట్లుగా స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు.
తాను కరోనా వైరస్ బారిన పడ్డారని, తాజాగా నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పాట్నాకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చెందినట్లుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ఈరోజు ప్రకటించారు. ఇక సీటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని , కొద్దిగా జ్వరం రావడంతో చికిత్స పొందేందుకు ఎయిమ్స్ లో చేరానని ఆయన తెలిపారు . కరోనా వైరస్ నుండి త్వరగానే కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవలసిన సమయంలో డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కి కరోనా సోకడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి విఘాతం కలిగింది.
బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 10వ తేదీన ప్రకటించబడతాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications