కుంభమేళాలో కరోనా విలయం .. 30 మంది నాగ సాధువులకు కరోనా పాజిటివ్
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న మెగా కుంభమేళా కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది నాగ సాధువులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇందులో రిషికేశ్లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరిన అఖిల భారత అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్ర గిరి ఉన్నారు. సాధువులు , కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు కరోనా మహమ్మారి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది . కుంభమేళా నిర్వహణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

మహమ్మారి బారిన పడిన 30 మంది నాగ సాధువులు
కుంభ మేళాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు 30 మంది నాగ సాధువులు మహమ్మారి బారిన పడ్డారు . ఈ కుంభమేళాలో పాల్గొన్న మరో ప్రముఖ సాధు - మహా నిర్వాణి అఖాడా నాయకుడిగా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన స్వామి కపిల్ దేవ్ డెహ్రాడూన్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా మహమ్మారి కి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన రిషికేశ్ లోని ఓ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించబడ్డారు.

కరోనా కారణంగా కుంభమేళా ముగిస్తున్నట్టు ప్రకటించిన నిరంజని అఖాడా
కుంభమేళ వద్ద 13 కంటే ఎక్కువ మత సమూహాలలో రెండవ అతిపెద్ద నిరంజని అఖాడా, షెడ్యూల్ ముగియడానికి దాదాపు రెండు వారాల ముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నాడు తమ కార్యక్రమాలను ముగించనున్నట్లు పేర్కొంది. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు, 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . కరోనా మహమ్మారి కారణంగా క్షీణిస్తున్న పరిస్థితుల దృష్ట్యా, కుంభమేళా మన కోసం ముగిస్తున్నారు. ప్రధాన 'షాహి స్నాన్' ('రాయల్ బాత్') ముగిసింది .

ఏప్రిల్ 10 నుండి 15 వరకు మొదటి ఐదు రోజులలో 2,167 మందికి కరోనా
మా అఖాడా నుండి చాలా మంది కరోనావైరస్ మహమ్మారి బారిన పడ్డారు అని రవీంద్ర నిరంజని అఖాడా కార్యదర్శి పేర్కొన్నారు
. ఏప్రిల్ 10 నుండి 15 వరకు మొదటి ఐదు రోజులలో కుంభ మేళా ప్రాంతానికి చెందిన 2,167 మంది కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్లు గురువారం రాత్రి వచ్చిన నివేదిక పేర్కొంది.
తదుపరి ముఖ్యమైన కుంభమేళా జరిగే రోజు ఏప్రిల్ 27. సాధువులు , ప్రజలు కరోనా బారిన పడటంతో పరిస్థితి దారుణంగా మారింది .

కుంభమేళా నిర్వహించడం పై విమర్శలు .. సమర్ధించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ హరిద్వార్ మెగా కుంభమేళా నిర్వహించడం పై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కుంభమేళ నిర్వహించడాన్ని సమర్థించారు, ఫేస్ మాస్క్ల వాడకం మరియు సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications