Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో కరోనా ఆందోళన: 7రోజుల పాటు లాక్ డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో విజృంభిస్తున్న కరోనా, సరిహద్దు దేశాలలో కూడా విజృంభించే అవకాశం ఉందన్న అనుమానాలతో ఇప్పటికే అనేక దేశాల్లో అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి పై ఆందోళన కొనసాగుతోంది.

దేశంలో కరోనా ఆందోళన .. ఏడు రోజుల పాటు లాక్ డౌన్?

దేశంలో కరోనా ఆందోళన .. ఏడు రోజుల పాటు లాక్ డౌన్?


కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బిఎఫ్ 7 కారణంగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జాగ్రత్తలు వహించాలని సూచనలు చేసింది. ఇక ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచనలు చేసింది. ఇక ఇదే సమయంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం భారతదేశంలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయబడుతుంది అని పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి.

యూట్యూబ్ చానల్స్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లాక్ డౌన్ ప్రచారం

యూట్యూబ్ చానల్స్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లాక్ డౌన్ ప్రచారం


అనేక యూట్యూబ్ ఛానల్స్ దేశంలో ఏడు రోజుల పాటు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించబడుతుందని ప్రచారం చేశాయి. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నేపధ్యంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు సదరు యూట్యూబ్ చానల్స్ వెల్లడించాయి. కోవిడ్-19 నాల్గవ తరంగాల భయాందోళనల మధ్య, భారత ప్రభుత్వం 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించిందని పేర్కొంటూ వైరల్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 24 నుండి భారతదేశంలో లాక్‌డౌన్ విధించబడుతుందని మరియు ఆంక్షలు ఒక వారం పాటు అమలులో ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

జనాల్లో కరోనా కర్ఫ్యూ పై చర్చ

జనాల్లో కరోనా కర్ఫ్యూ పై చర్చ


అంతేకాకుండా, అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అంతేకాదు విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రజలలో మరింత భయాందోళన నెలకొంది. పెద్ద ఎత్తున మళ్ళీ కర్ఫ్యూ విధిస్తారని జనాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ వార్తలలో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొంది.

లాక్ డౌన్ వార్తలపై కేంద్రం క్లారిటీ

లాక్ డౌన్ వార్తలపై కేంద్రం క్లారిటీ


కొన్ని రకాల మీడియాలలోనూ, యూట్యూబ్ ఛానల్స్ లోనూ వస్తున్న వార్తలు పుకార్లేనని, ప్రభుత్వం అటువంటి చర్యల దిశగా ఆలోచనలు చేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని, కర్ఫ్యూను అమలు చేయాల్సిన పరిస్థితి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కర్ఫ్యూ ఆలోచనే లేదని పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+