పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్న బీజేపీ.. కౌంటింగ్ స్టార్ట్
దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో బిజెపి దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా బిజెపి తన ఆధిక్యాన్ని ఆదిలోనే కనబరుస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, ఎన్టీయే పక్షాలకు ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది . కాంగ్రెస్, యూపీఏ పక్షాలు అతి స్వల్ప ఓట్లు దక్కించుకుంటున్నాయి. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మైసూర్ లోక్ సభ స్థానంలో బీజేపీ మందంజలో ఉన్నట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో 16 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో ఉన్నారు.అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు, అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ లో ఉన్నారు.