కరోనా విలయం: వరుసగా 7వరోజు -దేశంలో కొత్తగా 36,011 కేసులు, 482 మరణాలు -భారీగా రికవరీలు
13 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.7కోట్లకు, మరణాలు 15.4లక్షలకు పెరిగాయి. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుండగా, భారత్ లో మాత్రం వైరస్ వ్యాప్తి ఒకింత కంట్రోల్ లోకి వస్తున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..
Recommended Video
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36, 011 కొత్త కేసులు, 482 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96లక్షల 44వేల 222కు, మరణాల సంఖ్య 1లక్షా 40వేల 182కు పెరిగాయి. వరుసగా ఏడు రోజులపాటు.. అంటే గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా కొత్త కేసుల సంఖ్య 40వేలకు దిగువన నమోదు అవుతుండటం గమనార్హం.
భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానే
కొత్త కేసులు తగ్గుతుండటంతోపాటే డిశ్చార్జీలు భారీగా ఉండటం శుభపరిణామం. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 41,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 91లక్షల 792కు పెరిగింది. ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా భారత్ లో రికవరీ రేటు 94.37 శాతం ఉన్నట్లు ారోగ్య శాఖ తెలిపింది.
తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణం
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.18శాతాని తగ్గాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 2వేల 4గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.01లక్షల టెస్లులను చేపట్టారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 14.7కోట్లకు చేరింది. పలు ఫార్మా సంస్థలు తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో సమర్థవంతంగా పనిచేస్తుండటంతో వాటిలో కొన్నింటిని అత్యవసర వినియోగానికి లేదా సామూహిక వినియోగానికి ఆమోదించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ వచ్చే కొద్ది వారాల్లోనే మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం తెలిసిందే.