కరోనా మృతదేహాల నుంచి వ్యాప్తి చెందుతుందా? జాగ్రత్తలేంటీ?: ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ: కరోనాతో మరణించినవారితో ఇతరులకు ఆ మహమ్మారి సోకుతుందా? అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఎందుకంటే.. కరోనాతో మరణించినవారి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సొంత కుటుంబసభ్యులు కూడా దూరంగానే ఉంటున్నారు. దీంతో వైద్య సిబ్బంది లేదా మున్సిపల్ సిబ్బందే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.

కరోనా మృతిచెందినవారిలో వైరస్ ఒకరోజుకు మించి బతకదు
అయితే, కరోనాతో మృతి చెందినవారి శరీరం నుంచి కరోనా ఇతరులకు సోకుతుందా? అనే విషయంపై ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టతనిచ్చారు. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత కరోనావైరస్ బతకలేదని తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫొరెన్సిక్ మెడిసిన్ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. కరోనా పాజిటివ్తో చనిపోయిన మెడికో-లీగల్ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా..
కరోనా వైరస్ బారినపడి చనిపోయినవారి మృతదేహాలను 100కుపైగా పరీక్షించినట్లు గుప్తా వెల్లడించారు. ఈ సందర్భంగా మృతదేహాలను మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే 12-24 గంటల తర్వాత ఆ వ్యక్తి ముక్కు, శరీరంలో వైరస్ బతికి ఉండలేదని గుర్తించినట్లు తెలిపారు. శవాల నుంచి వైరస్ వ్యాప్తి జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయన్నారు. అయితే, ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసివేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్ చేయాలని సూచించారు.
Recommended Video

కరోనా మృతుల అంత్యక్రియల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇక కరోనాతో మరణించినవారి అంత్యక్రియల్లో పాల్గొనేవారు ముందస్తు రక్షణగా ఖచ్చితంగా మాస్కులు, చేతికి గ్లౌవ్స్, పీపీఈ కిట్లు ధరించాలని డాక్టర్ గుప్తా స్పష్టం చేశారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం చితాభస్మం సేరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు. అప్పుడు కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. చనిపోయినవారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే తాము ఈ అధ్యయనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకపోవడం మంచిదని ఇప్పటికే ఐసీఎంఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications