క్రెడిట్ సుప్రీందే: జెఠ్మలానీ, రహస్య ఎజెండా: ఏచూరి
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత అంశంపై ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ స్పందించారు. భారత రాజకీయ చరిత్రలో ఇదో శుభపరిణామమని ఆయన అన్నారు. అయితే ఈ క్రెడిట్ ఆర్థిక శాఖకు గానీ అటార్నీ జనరల్కు దానీ దక్కదని, సుప్రీంకోర్టుకే దక్కుతుందని ఆయన అన్నారు.
నల్లకుబేరుల జాబితాలోని పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలని ఆయన సూచించారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం లేదా అధికారవర్గం చేతుల్లో పెట్టుకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నల్లకుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన విషయం తెలిసిందే.

విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని భారత్కు తెప్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కేవలం నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడమే కాకుండా నల్లధనాన్ని భారత్కు తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో బిజెపికి అండగా నిలిచిన కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, అయితే మళ్లీ ఆ అంశాన్ని కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకుని వెళ్లిందో తెలియడం లేదని ఆయన అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications