ఢిల్లీ జూ ఘటన: పులిని చూసేందుకు పోటెత్తుతున్నారు
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం ఢిల్లీ జూలో తెల్లపులి ఇరవై ఏళ్ల యువకుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ పులిని చూసేందుకు ఆ జూకు పెద్ద ఎత్తున వీక్షకులు తరలి వస్తున్నారట. విద్యార్థిని పులిని చంపిన సంఘటన మంగళవారం జరిగింది. ఆ తర్వాత రోజు నుండి చాలామంది ఆ తెల్లపులిని చూసేందుకు వస్తున్నారట.
విద్యార్థిని పులి చంపేసిందనే వార్త చూశాక చాలామంది వచ్చి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లక్నోకు ఓ వ్యక్తి బుధవారం పులిని చూసేందుకు వచ్చాడు. తాను లక్నోకు చెందిన వాడినని, మంగళవారం నాటి సంఘటన చూశాక తాను ఢిల్లీ జూను సందర్శించాలనుకున్నానని, ఇది తాను ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదని చెప్పాడు.

సెంట్రల్ ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి కూడా ఇదే చెప్పారు. నేషనల్ జువాలాజికల్ పార్క్ వద్ద ఉండే ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. బుధవారం చాలా రద్దీగా ఉందని చెప్పాడు.
కాగా, నాలుగు రోజుల క్రితం ఇరవయ్యేళ్ల సెకండియర్ స్టూడెంట్ను తెల్లపులి చంపిన విషయం తెలిసిందే. అతను పులి ఉన్న ఎన్క్లోజర్లో పడిపోయాడు. అప్పుడు ఆ పులి అతనిని నోటకరుచుకొని వెళ్లిపోయింది. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications