Cyclone Ditwah మహోగ్రం: తమిళనాడులో కల్లోలం- ముగ్గురు దుర్మరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తరం ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్లా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది.
శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వ తుఫాను.. నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. తమిళనాడులోని కారైకల్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 80, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 160, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయ దిశలో 250 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను శ్రీలంక తీరం, బంగాళాఖాతం నైరుతి- వాయువ్య దిశలో కదులుతోంది.

తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంత తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అటు తమిళనాడులో ఈ తుఫాన్ విలయం సృష్టిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ విపత్తు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 57,000 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది. అలాగే 149 పశువులు మరణించినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఆదివారం వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు చనిపోగా, మైలాడుతురైలో విద్యుత్ షాక్తో 20 ఏళ్ల యువకుడు మరణించినట్లు మంత్రి తెలిపారు.
డెల్టా జిల్లాల్లో వ్యవసాయ భూములకు జరిగిన నష్టాన్ని మంత్రి వివరించారు. నాగపట్నంలో 24,000 హెక్టార్లు, తిరువారూర్ జిల్లాలో 15,000 హెక్టార్లు, మైలాడుతురైలో 8,000 హెక్టార్ల భూమి దెబ్బతిన్నాయి. మొత్తంగా 57,000 హెక్టార్ల సాగు భూములు నీట మునిగాయని రామచంద్రన్ పేర్కొన్నారు. డెల్టా జిల్లాల్లో దాదాపు 234 గుడిసెలు ధ్వంసమయ్యాయని మంత్రి తెలిపారు. విపత్తు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా 28 బృందాలను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి అదనంగా 10 బృందాలు తమిళనాడుకు చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా గత 24 గంటల్లో పుదుచ్చేరిలోని కారైకల్లో అత్యధికంగా 19 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మైలాడుతురై జిల్లాలోని సెంబనార్ కోయిల్లో ఆదివారం ఉదయం 8:30 గంటల నాటికి 17 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, రాణిపేట్ జిల్లాల్లో, పుదుచ్చేరి, కారైకల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications