జవాద్ తుపాను: ఉత్తరాంధ్రలో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు.. పరిస్థితులను సమీక్షించిన ప్రధాని మోదీ
బంగాళా ఖాతంలో అల్ప పీడనం బలపడి తుపానుగా మారడంతో పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు.
''రానున్న మూడు రోజుల్లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమాచారం అందించాం. సహాయక చర్యల ఏర్పాట్లను హోం శాఖ కార్యదర్శి వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 29 బృందాలను మోహరించాం. తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది’’అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.
https://twitter.com/ANI/status/1466330990037520389
మధ్య అండమాన్ సముద్రంలో డిసెంబరు 1న ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.
ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రానున్న 12 గంటల్లో వాయు గుండంగా మారుతుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారుతుంది.
ఈ తుపానుకు జవాద్గా నామకరణం చేశారు. ఇది నాలుగో తేదీ అంటే శనివారం ఒడిశా లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
- తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
100 కి.మీ. వేగంతో గాలులు..
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని తీర ప్రాంతాల్లో జవాద్ తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ కూడా వెల్లడించింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, శ్రీకాకుళంతోపాటు ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
పశ్చిమ బెంగాల్లోని గంగా పరివాహక ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
తుపాను సన్నద్ధతపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో నేషనల్ క్రైసిస్ మేనేజ్ కమిటీ (ఎన్సీఎంసీ) కూడా సమావేశమై, పరిస్థితులను సమీక్షించింది.
మరోవైపు ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్సింగ్పుర్లకు ఐఎండీ రెడ్ అలర్టులు జారీచేసింది.
తుపాను ముప్పు నడుమ నేటి నుంచి మూడు రోజులవరకు మొత్తంగా 95 రైళ్లను కోస్తా రైల్వే విభాగం రద్దుచేసింది.
ఇవి కూడా చదవండి:
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్ఫాదర్ను అధిగమించిన భారతీయ సినిమా
- అసలు కాలుష్యం కంటే టీవీ చానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్లో అందుబాటులోకి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)