ఇంత ఓర్వలేని తనమా?: దళిత పెళ్లి కొడుకు గుర్రంపై ఎక్కాడని..
హర్యానాలోని ఛార్కీ దాద్రీ జిల్లా సంజార్వాస్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకి అద్దం పడుతోంది.
భివానీ: ఒక దళిత పెళ్లి కొడుకు పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రంపై ఎక్కాడని అక్కడి అగ్రకులాలు ఆగ్రహించాయి. తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వారిపై దాడికి పాల్పడ్డాయి. హర్యానాలోని ఛార్కీ దాద్రీ జిల్లా సంజార్వాస్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకి అద్దం పడుతోంది.
సంజర్వాన్ గ్రామానికి చెందిన అమ్మాయితో సంజయ్ అనే యువకుడికి పెళ్లి కుదరడంతో.. పెళ్లిరోజు గుర్రంపై అతను వధువు ఇంటికి వచ్చాడు. అంతే.. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వధూవరుల కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో గాయపడినవారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామ సర్పంచ్ భర్త వికాస్ ఈ ఘటనను సమర్థించడం గమనార్హం. గ్రామంలో దళితులు గుర్రాలపై ఊరేగడానికి వీల్లేదని సర్పంచ్ భర్త చెప్పారు. ఘటనపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications