విదేశీ మహిళపై 3 గంటలు రేప్: ఇద్దరు అరెస్టు

భారత పర్యటనను ముగించుకోవడానికి సిద్ధపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తాను బస చేసిన పహర్గంజ్ హోటల్కు తిరిగి వస్తూ దారి తప్పింది. ఆమె న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని స్టేట్ ఎంట్రీ రోడ్డులో గల రైల్వే ఆఫీసర్స్ క్లబ్కు చేరుకుంది. అక్కడ ఆమెను చిన్న పాటి తోటలోకి ఆమె తోసుకెళ్లారు. కత్తితో బెదిరించి దుండగులు ఆమెను దోపిడీ చేశారు.
దోపిడీ చేసి వదలకుండా ఆమెపై అత్యాచారం చేశారు ఎనిమిది మందిలో ఇద్దరు రెండేసి సార్లు తనను రేప్ చేశారని బాధితురాలు చెప్పింది. ఎట్టకేలకు ఆమె సాయంత్రం ఏడున్నర గంటలకు హోటల్కు చేరుకోగలిగింది. జరిగిన సంఘటనను హోటల్ మేనేజర్కు చెప్పింది.
డెన్మార్క్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు బుధవారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్కు చెందిన మహేందర్ గంజాకు పోలీసులు గుర్తించారు. అతను గతంలో రెండు హత్య కేసుల్లో నిందితుడని తెలుస్తోంది.
మరో నిందితుడిని రాజాగా గుర్తించారు. అతని నుంచి బాధితురాలికి చెందిన వేయి రూపాయల నగదును, కళ్లద్దాల కేస్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications