తివారీకి బెయిల్: రూ.10వేలు చెల్లించాలని ఆదేశం
ముంబై: కేంద్రమంత్రి మనీష్ తివారీని మహారాష్ట్రలోని ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రూ. 10 వేలకు బాండు చెల్లించమని ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ఆదర్శ్ సొసైటీలో నితిన్ గడ్కరీ బినామీ పేరుతో ఫ్లాట్ కలిగివున్నారని మనీష్ తివారీ ఆరోపించారు. దీనిపై 2010 డిసెంబర్లో నితిన్ గడ్కరీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు మనీష్ తివారీకి ఆదేశాలు జారీ చేసింది.

అంతేగాక నితిన్ గడ్కరీకి రూ. 10వేల బాండు చెల్లించాలని తివారీని ఆదేశించింది. కాగా, పరువు నష్టం కేసులో మనీష్ తివారీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ఎస్ గులానే ఎదుట తన తరపు న్యాయవాది మనోజ్ మోహిత్తోపాటు హాజరైన మనీష్ తివారీ బెయిల్ పత్రాలను దాఖలు చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications