ప్రపంచ ఉగ్రవాదికి పాక్ రూ.14 కోట్లా నజరానా ? అక్కడ భారత్ తీవ్ర అభ్యంతరం..!
పహల్గాం తీవ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే ఇందులో 14 మంది కుటుంబ సబ్యుల్ని కోల్పోయిన మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజహర్ కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల పరిహారం ప్రకటించింది. ఈ సాయం త్వరలోనే ఆయనకు అందించబోతున్నారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పాకిస్తాన్ మెడకు చుట్టుకునేలా ఉంది. పాకిస్తాన్ నిర్ణయంపై భారత్ ఇవాళ తీవ్రంగా స్పందించింది.
భారత్ లో పార్లమెంట్ పై దాడి సహా పలు కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజహర్ కు రూ.14 కోట్ల పరిహారం అందించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న తీవ్రవాద నెట్ వర్క్ ను తిరిగి నిర్మించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ కు ప్రకటించిన 7500 కోట్ల సాయంపై ప్రపంచ బ్యాంక్ పునరాలోచించుకోవాలని కోరారు.

పాకిస్తాన్ లోని మురిద్కే, బహవల్పూర్లలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించిందని రాజ్ నాథ్ ఆరోపించారు. ప్రపంచ బ్యాంక్ నుండి వచ్చే బిలియన్ డాలర్లలో గణనీయమైన భాగం ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడుతుందని తెలిపారు. దీనిని ప్రపంచ బ్యాంక్ ఉగ్రవాదనికి పరోక్ష నిధులుగా పరిగణించదా అని ప్రశ్నించారు.
#WATCH | Bhuj, Gujarat | Defence Minister Rajnath Singh says, "#OperationSindoor is not over yet. Whatever happened was just a trailer. When the right time comes, we will show the full picture to the world." pic.twitter.com/13BHeIZgkS
— ANI (@ANI) May 16, 2025
పాకిస్తాన్ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఐరాస మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిపై ఖర్చు చేయాలనుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. కాబట్టి ప్రపంచ బ్యాంక్ వెంటనే పాకిస్తాన్ కు ఇవ్వదల్చుకున్న 140 మిలియన్ డాలర్ల సాయంపై పునరాలోచించుకోవాలని కోరారు.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications