రేప్ చేశాడు: ఏడాది సహజీవనం చేసి 16 ఏళ్ల బాలుడిపై 14 ఏళ్ల బాలిక కేసు
న్యూఢిల్లీ: 16 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక సహజీవనం చేశారు. కొద్ది రోజులకు ఈ మైనర్లు ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి.. తనను పలుమార్లు రేప్ చేశాడని అతని పైన ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం నాడు వెల్లడించారు.
ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. వీరిద్దరు ఏడాది పాటు సహజీవనం చేశారు. ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక.. తన పైన పదహారేళ్ల బాలుడు ఏడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.

తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు గుర్తించారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.
ఇద్దరు మైనర్ల మధ్య కేసును ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. చివరకు బాలిక ఫిర్యాదు మేరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరు తొలుత స్నేహితులను, ఆ తర్వాత సహజీవనం ప్రారంభించారని పోలీసులు చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications