దారుణం : 62 ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడి-కత్తితో 20 సార్లు పొడిచిన నిందితుడు
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తి... కత్తితో ఆమెను 20 సార్లు పొడిచాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు ఎందుకీ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదు.
వివరాల్లోకి వెళ్తే... బిహార్లోని బెగుసరాయ్కి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు ఢిల్లీలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. ఆమె మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం(జూన్ 12) మనవడు డ్యూటీకి వెళ్లగా... ఆమె కూరగాయలు అమ్మేందుకు వెళ్లింది. కొద్దిగంటల తర్వాత తిరిగి ఇంటి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది.

ఇంట్లో వృద్దురాలు ఒంటరిగా ఉన్న విషయం గమనించిన ఓ వ్యక్తి... ఇదే అదనుగా లోపలికి చొరబడి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె శరీరంపై 20 సార్లు పొడిచాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అప్పటికే వృద్దురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్దారించారు.
Recommended Video
వృద్దురాలిపై కత్తితో దాడి చేయడం కంటే ముందు... నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. కత్తితో ఆమె గొంతు కోసిన ఆనవాళ్లు గుర్తించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు... ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడించాడు. అయితే వృద్దురాలిని అతను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులు వెల్లడించలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications