1100 కరోనా కేసులు.. హోళిపై ప్రభావం.. పబ్లిక్ ప్లేసులలో నో సెలబ్రేషన్స్..
కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్నీచోట్ల ఎక్కువగా వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో 1100 కేసులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హోళి పండగపై ఆంక్షలు విధించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున.. పబ్లిక్ ప్లేసులలో హోళి పండగ సెలబ్రేట్ చేసుకోవద్దని స్పష్టంచేసింది. పండగపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మంగళవారం 1101 కేసులు రాగా.. మరునాడు ఆంక్షలు అమలు చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 19వ తేదీన తర్వాత ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. అప్పుడు 1139 కేసులు వచ్చాయి. పండగల సందర్భంగా అందరూ గుమిగూడొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.
Recommended Video
అలాగే ఇతర చోట్ల నుంచి వచ్చేవారికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయాలని స్పస్టంచేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఇదీ తప్పడం లేదు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లలో పరీక్ష చేసి.. నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతిస్తారు. ఇటు తెలంగాణలో రేపటినుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పిల్లలు/ టీచర్స్ ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నది.