వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటోన్మెంట్ ఎన్నికలు: గాల్లోకి డబ్బులు వెదజల్లిన ఆప్ కార్యకర్తలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ.. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తామని అంటున్న అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నంద్ కిషోర్ బెనివాల్ గెలిచారు.

ఈ ఆనందంలో మద్దతుదారులతో కలిసి ఆయన సోమవారం నిర్వహించిన ర్యాలీలు డబ్బులను గాల్లోకి వెదజల్లారు. ఈ తతంగమంతా కెమెరాలకు చిక్కింది. దీంతో ఘటన వివాదంగా మారింది. ప్రజల నుంచి సేకరించిన డబ్బులు ఎక్కడిపోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నారు.

Arvind Kejriwal

అవినీతి రహిత పార్టీగా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన అరవింద్ కేజ్రివాల్‌కి తలనొప్పిగా మారింది.

కాగా, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆప్ నేతలంటున్నారు. డబ్బులు విసిరిన కార్యకర్తను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఇలాంటి చర్యలను సమర్థించనని నంద్ కిషోర్ బెనివాల్ తెలిపారు.

కాగా, 8 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బిజెపి 5, ఆప్ 2, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఆప్ తొలిసారి పోటీ చేసింది.

English summary
Arvind Kejriwal's Aam Aadmi Party, which is positioning itself as a clean and corruption free alternative in Delhi to the two national parties, has run into trouble with its winning candidate Nand Kishor Beniwal's supporters in the Delhi Cantontment Board polls throwing up wads of money in the air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X