సీఎం జట్టు పట్టుకుని లాగి, చెంప ఛెళ్లుమనిపించి..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలతో ముఖాముఖి (Jan Sunwai) సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తం రేఖా గుప్తాపై దాడి చేసినట్లు ప్రాథమకంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ రేఖా గుప్తా ప్రతివారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉదయం 9 గంటలకు ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

అదే సమయంలో- 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి దాడికి దిగాడు. తొలుత ఓ వినతిపత్రాన్ని రేఖా గుప్తాకు అందించారు. తన సమస్యలను చెప్పుకొన్నాడు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదని వాపోయాడు. దీనికి అధికార యంత్రాంగం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో, హఠాత్తుగా అతను రేఖా గుప్తాపై దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగినట్లు కూడా తెలుస్తోంది. ఈ అనూహ్య ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. అతని వివరాల గురించి ఆరా తీస్తోన్నారు.
అతన్ని తనిఖీ చేయగా.. కోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభించాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఢిల్లీ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని పేర్కొంది.
ఈ దాడిలో ముఖ్యమంత్రికి తలకు గాయం అయిందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటన పట్ల బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ విమర్శలు గుప్పించారు. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో ఆరా తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications