కాంగ్రెసుకు చావుదెబ్బ: పార్టీ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు చావు దెబ్బ తిన్నది, ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరువు దక్కించుకున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల సారథ్య బాధ్యతను అజయ్ మాకెన్కు అప్పగించినప్పటికీ ఫలితం ఏ మాత్రం దక్కలేదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని అజయ్ మాకెన్ నిర్ణయించుకున్నారు.
ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని, తన సీటును కూడా గెలుచుకోలేకపోయానని, అందువల్ల బాధ్యత తనదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి, తన రాజీనామా లేఖను అందిస్తానని ఆయన చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేని స్థితికి చేరుకుంది.

మాకెన్ ఢిల్లీలో సదర్ బజార్ సీటు నుంచి పోటీ చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి అభ్యర్థుల కన్నా వెనకబడి ఉన్నారు. ఆయన మూడో స్థానంలో ఉన్నారు. దీంతో ఆయన విజయం సాధించడమనేది జరిగే పని కాదని తేలిపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను సాధిస్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వేలను మించి అది విజయాలను అందుకుంటోంది. 70 సీట్లున్న అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయానికి ఆప్ చేరువైంది. బిజెపి 7 సీట్లలో మాత్రమే ఆధిక్యతలో ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications