ఢిల్లీ మసీదులో కరోనా వ్యాప్తి కేసుపై హైకోర్టు సంచలన తీర్పు..!
2020లో కరోనా వ్యాప్తి ఆరంభదశలో ఉన్న సమయంలో ఢిల్లీలోని ఓ మసీదులో తబ్లిగీ జమాత్ ముస్లింలు సమావేశమయ్యారు. కోవిడ్ ఆరంభమైన తర్వాత ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో వారు ఆ మసీదులోనే ఉండిపోయారు. తద్వారా ఎంతో మందికి కోవిడ్ వ్యాప్తి కావడానికి కారణమయ్యారన్న ఆరోపణలతో 70 మందిపై వివిధ సెక్షన్ల కింద 16 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఐదేళ్లుగా సాగుతున్న విచారణ ముగించిన ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది.
ఢిల్లీ మసీదులో తబ్లిగీ జమాత్ సభ్యులు సమావేశమై కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తేల్చేసింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన 16 కేసుల్ని కొట్టేసింది. ఈ కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న 70 మంది ముస్లింలకు విముక్తి లభించినట్లయింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ బహిరంగ కోర్టులో విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇస్లాంలోని తబ్లిగీ జమాత్ కు చెందిన 70 మంది సభ్యులపై 2020 మార్చి 24, మార్చి 30 మధ్య కోవిడ్ సమయంలో విదేశీ పౌరులను వేర్వేరు మసీదులలో ఉంచారని ఆరోపిస్తూ 16 కేసులు నమోదు చేశారు. 70 మంది నిందితులపై నేరపూరిత కుట్రతో సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఎఫ్ఐఆర్లలో 195 మంది విదేశీ పౌరుల పేర్లు కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వారందరికీ విముక్తి లభించింది.
అప్పట్లో కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని వీరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఢిల్లీలోని మర్కజ్ మసీదు వద్ద జరిగిన జమాత్ సమావేశంలో పాల్గొనడం ద్వారా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రభుత్వం 950 మందికి పైగా విదేశీ పౌరులను బ్లాక్ లిస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో అప్పట్లో పోలీసులు తీసుకున్న చర్యల్లో పస లేదని తేలిపోయింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications