మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా అరెస్ట్
న్యూఢిల్లీ: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జిఎన్ సాయిబాబా అరెస్టయ్యారు. మహారాష్ట్ర పోలీసులు ఆయనను న్యూఢిల్లీలో శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా కొనసాగుతున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిబాబా సిపిఐ మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పోలీసులు సాయిబాబాను మహారాష్ట్రలోని గడ్చిరోలికి తరలించనున్నారు. సాయిబాబా పూర్తి పేరు గోకులకొండ నాగ సాయిబాబా. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం గ్రామానికి చెందినవారు.

గత జనవరిలో కూడా పోలీసులు సాయిబాబాను ప్రశ్నించారు. అతనికి చెందిన కంప్యూటర్ను సీజ్ చేశారు. మావోయిస్టు పార్టీకి సంబంధాలున్నాయనే అనుమానంతో ఆయనపై ఈ దాడులు నిర్వహించారు. కాగా, దాడుల అనంతరం సాయిబాబా మాట్లాడుతూ.. తన రాజకీయ కార్యకలాపాలు, అకాడమిక్ ఆసక్తులపై పోలీసులు పలు ప్రశ్నలు అడిగారని, వాటికి తాను సమాధానం చెప్పానని తెలిపారు.
ఇది ఇలా ఉండగా సాయిబాబాను భేషరతుగా విడుదల చేయాలని రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్(ఆర్డిఎఫ్) నేత వరవరరావు హైదరాబాద్లో డిమాండ్ చేశారు. ఆయనకు ఎలాంటి ముప్పు కలిగినా ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications