3నెలల క్రితమే పెళ్లి: యువకుడి ప్రాణం తీసిన ల్యాప్టాప్
న్యూఢిల్లీ: ఓ యువకుడు ల్యాప్టాప్ వాడుతుండగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోవింద్పురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్(23) అనే యువకుడు ఛార్జింగ్లో ఉన్న ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు.
ఒక్కసారిగా షాక్ కొట్టడంతో బ్రిజేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబీకులు బ్రిజేశ్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఫోరెన్సిక్ టీం సాయంతో సెక్షన్174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిజేశ్కి మూడు నెలల క్రితమే వివాహమైంది. భర్త మరణంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరంగా అతని గత చరిత్ర, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం, ఇంట్లో విద్యుత్ సరఫరాకి సంబంధించి ఏర్పాటుచేసిన ఎర్తింగ్ పరిస్థితి, ల్యాప్టాప్ నాణ్యత, తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications