వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దనోట్ల రద్దు: ఆ ఒక్క రాత్రే 15టన్నుల గోల్డ్ అమ్మేశారు!

|
Google Oneindia TeluguNews

నల్లధనం, నకిలీ కరెర్సీని నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు 8వ తేదీ రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా ఏకంగా 15 టన్నుల బంగారం అమ్ముడుపోయిందని భారత బంగారం, ఆభరణ వర్తకుల సంఘం (ఐబీజేఏ) అధికారులు తెలిపారు.

సాధారణంగా ఓ నెలలో అమ్ముడుపోయే బంగారంలో ఇది 20 శాతం కావడం విశేషం. దీని విలువ దాదాపు రూ.5వేల కోట్లు ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి దేశంలో ఉన్న ఆరు లక్షల బంగారు వ్యాపారుల్లో 1800 మంది నిబంధనలను ఉల్లంఘించి పాత నోట్లకు విక్రయాలు జరిపారని ఐబీజేఏ అధికారులు పేర్కొన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Demonetisation effect: 15 tonnes of gold sold on November 8-9

ఇది ఇలా ఉండగా, అనుమానాస్పద వ్యాపారుల నుంచి నవంబరు 7 నుంచి 11 వరకు సాగించిన అమ్మకాల వివరాలను తెప్పించుకుని కేంద్ర ఎక్సైజ్‌ నిఘా విభాగం పరిశీలిస్తోంది. సాధారణంగా దేశంలో ఏటా సరాసరి 800 టన్నుల అమ్మకాలు జరుగుతాయి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో 500 టన్నులు కూడా మించకపోవడం గమనార్హం.

English summary
Jewellers sold 15 tonnes of gold ornaments and bars, worth around Rs 5,000 crore, on the intervening night of November 8 and 9 after the government demonetised Rs 500 and Rs 1,000 denomination notes, said Surendra Mehta, national secretary of India Bullion & Jewellers Association (IBJA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X