డిప్యూటీ సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
దేశంలో గగనతల ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ దఫా ఈ ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోంది. ఈ విమాన ప్రమాదం వల్లే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్ తో పాటు ఇతర సిబ్బంది కన్నుమూశారు.
ఇప్పుడు తాజాగా అలాంటి ప్రమాదమే సంభవించింది గానీ.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లక్నో నుంచి కౌశాంబికి వెళ్తున్న ఆయన హెలికాప్టర్లో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో లక్నోలోని అమాసి విమానాశ్రయంలో ఈ హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రత్యేక హెలికాప్టర్ లో కౌశంబీకి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ లక్నోలోని లా మార్ట్స్ గ్రౌండ్స్ నుండి కౌశాంబికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత హెలికాప్టర్ క్యాబిన్లో పొగ కమ్ముకుంది. డిస్ప్లే కూడా స్తంభించిపోయింది. ఆ సమయంలో కేశవ్ ప్రసాద్ మౌర్య హెలికాప్టర్ లోనే ఉన్నారు. హెలికాప్టర్ లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యారు. లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదించారు. హెలికాప్టర్ కు అత్యంత సమీపంలో ఉన్న అమాసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఏటీసీ నుండి తక్షణమే ఆమోదం లభించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ ను సురక్షితంగా నేలకు దించారు. భద్రతా సిబ్బంది ఆయనను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.
డిప్యూటీ సీఎం క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయనతో పాటు సిబ్బందికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సాంకేతిక లోపమే ప్రధాన కారణమని తేలింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications