డేరా బాబాపై మళ్లీ విచారణ! ఈసారి రెండు హత్య కేసుల్లో.. పంచకులలో భద్రత కట్టుదిట్టం..
రెండు అత్యాచార కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను శనివారం మళ్లీ విచారించనున్నారు.
Recommended Video

పంచకుల: రెండు అత్యాచార కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను శనివారం మళ్లీ విచారించనున్నారు. సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్ రంజిత్ హత్య కేసుల్లో గుర్మీత్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై శనివారం హరియాణాలోని పంచకుల సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పంచకులలో భద్రత కట్టుదిట్టం చేశారు.

గుర్మీత్పై అత్యాచార కేసులను ఇదే కోర్టులో విచారించారు. ఆగస్టు 25న జరిగిన ఈ విచారణలో గుర్మీత్ను దోషిగా తేలుస్తూ న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు చెప్పారు. ఆ సమయంలో పంచకులలో పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగాయి.
గుర్మీత్ అనుచరులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడమేగాక.. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ అల్లర్ల నేపథ్యంలో గుర్మీత్ శిక్ష ఖరారు రోజున.. రోహ్తక్లోని జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో గుర్మీత్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications