48 స్కూల్స్ టార్గెట్, వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి, డీసీఎం, హోమ్ మంత్రి ఎంట్రీ, మ్యాటర్ !
బెంగళూరులోని పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపు ఇమెయిల్ పంపించారు. బెంగళూరులోని పలు స్కూల్స్ లో బాంబులు పెట్టారని బెదిరింపులు రావడంతో సంబంధిత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గురైనారు. భద్రతా కారణాల దృష్ట్యా బెంగళూరులోని దాదాపు 50 శాతం పాఠశాల యాజమాన్యం పిల్లలను ఇంటికి పంపించింది. బెంగళూరులో ఒకేసారి 48 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
శుక్రవారం చాలా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బెదిరింపులకు గురైన పాఠశాలల జాబితా 48 స్కూల్స్ కావడంతో ఆ స్కూల్స్ పేర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన స్కూల్స్ చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళనకు గురైనారు. శుక్రవారం బెంగళూరులో ఎక్కడ చూసినా బాంబు బెదిరింపు ఈ మెయిల్ గురించి జోరుగా చర్చ జరిగింది.

పాఠశాలల్లో బాంబులు పెట్టారని బెదిరింపు లేఖలు వచ్చాయి అనే విషయం తెలిసిన వెంటనే కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఇంటి సమీపంలోని పాఠశాలకు వెళ్లి ఆ స్కూల్ లోని ఉద్యోగులు, పోలీసులతో పాటు ఆయన కూడా తనిఖీలు నిర్వహించారు. ఇంట్లోనే తాను టీవీలో స్కూల్ లో బాంబులు పెట్టారని బెదిరించారని వార్తలు చూశానని, మా ఇంటి ముందే స్కూల్ ఉంది, అది చూసి తాను షాక్ అయ్యానని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.
వెంటనే వచ్చి పోలీసులతో మాట్లాడాను. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపుల లేఖ వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారని, ప్రాథమిక సమాచారంతో చూస్తే అది నకిలీ బాంబు బెదిరింపుగా కనిపిస్తోందని, కొందరు వ్యక్తులు కావాలనే ఇలా చేస్తున్నారని, కానీ మనం దానిని నిర్లక్షం చేస్తే ఎప్పుడో ఒకసారి నిందితులు నిజంగానే దాన్ని నిజం చేస్తే అప్పుడు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తోందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పుడప్పుడూ ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తుంటారు, మనం దేనిని నిర్లక్ష్యం చేయకూడదు, పోలీసులు అన్నింటినీ తనిఖీ చేశారు, మన సైబర్ క్రైమ్ పోలీసులు సమర్థులని, నిందిుతలు ఎవరో కనిపెడతారని, బెంగళూరు నగర పోలీసు కమీషనర్ దయానంద్ తో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీతో తాను మాట్లాడానని, త్వరలో నిందితులను పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారని డీకే శివకుమార్ వివరించారు.
బెంగళూరులోని పాఠశాలల్లో బాంబు బెదిరింపుల ఘటనపై కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్, బెంగళూరు రూరల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. బెదిరింపు కాల్లు వచ్చిన అన్ని ప్రాంతాలకు సీఐడీ అధికారి, సిబ్బంది, అన్ని స్క్వాడ్లను పంపించాలని, జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక హెమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ సంబంధిత పోలీసుల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications