'ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, మా ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరసారాలు'
తమిళనాడు రాష్ట్రంలోని పళని స్వామి నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆరో
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని పళని స్వామి నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు.

అన్నాడిఎంకె పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన సిఎం పళని స్వామి, ప్రిసీడియం ఛైర్మెన్ సెంగుట్టయన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో దినకరన్ సమావేశమయ్యారు.
గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలను మాత్రమే పిలిపించారు.ఈ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి.
డిఎంకె అధినేత స్టాలిన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వానికి మద్దతుగా స్టాలిన్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
పన్నీర్ సెల్వం శిభిరంలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై స్టాలిన్ ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.పన్నీర్ సెల్వం వర్గంలోకి చేరే ఎమ్మెల్యేలకు అన్ని సమకూర్చేందుకుగాను స్టాలిన్ సిద్దంగా ఉన్నారని చెప్పారు.
15 మంది ఎమ్మెల్యేలను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రలోభాలకు గురిచేశారని ఆయన చెప్పారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ఆర్ కె నగర్ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
తప్పుడు ఆరోపణలంటూ స్టాలిన్ ఖండన
అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు.ప్రచారం కోసమే దినకరన్ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని స్టాలిన్ చెప్పారు. అర్హత లేని వారు చేసిన వ్యాఖ్యలను పరిగణించాల్సిన అవసరం లేదన్నారాయన.
-
50 ఏళ్ల శాపాన్ని స్టాలిన్ చెరిపేస్తారా?: డీఎంకేకు 'వరుస' గండం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications