స్కూటీపై కుక్క మూత్రం పోసిందని కాల్పులు, నలుగరికి తీవ్రగాయాలు
చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారింది.కుక్క బైక్ పై మూత్రం పోసినందుకు ప్రారంభమైన గొడవ కాల్పులకు దారితీసింది.ఈ గొడవలో నలుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది..
లక్నో: చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారింది.కుక్క బైక్ పై మూత్రం పోసినందుకు ప్రారంభమైన గొడవ కాల్పులకు దారితీసింది.ఈ గొడవలో నలుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చిన్న విషయానికి చేలరేగిన వివాదం కాల్పులకు దారితీసింది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలో అన్నపూర్ణదేవి గుడికి వెళ్ళాడు.

అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన రెండు పెంపుడు కుక్కలు అటు వైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోశాయి.
అయితే స్కూటీపై కుక్కలు మూత్రం పోయడంతో పూరన్ లాల్ మున్నాతో గొడవకు దిగాడు. ఇద్దరి మద్య వాదన తీవ్రమైంది. మున్నా కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మున్నా , అతడి కొడుకు కలిసి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో పూరన్ లాల్ అతడి కొడుకులు విజయ్ కుమార్, ముఖేష్ కుమార్ తో పాటు రాంకిషోర్ శర్మ అనే మరో వ్యక్తి కూడ గాయపడ్డారు. వాళ్ళందరినీ వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుండి పారిపోయారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications