నోట్ల మార్పిడి కోసం సిరా వాడొద్దు: ఈసీ అభ్యంతరం
న్యూఢిల్లీ: పాత నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిరా గుర్తు వాడకంపై గందరగోళం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
అందువల్ల సిరాగుర్తు వాడకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. పెద్దనోట్ల రద్దుతో పాతనోట్లు మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే.

రోజులు గడుస్తున్నా బ్యాంకుల్లో బారులు తరగకపోవడంపై కేంద్రం దృష్టి సారించింది. పాతనోట్లు మార్చుకుంటున్న వారు రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తున్నారని.. దీంతోనే బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీన్ని నివారించేందుకు నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరాగుర్తు వాడాలని నిర్ణయించింది.
ప్రస్తుత ఎన్నికల సంఘం లేఖతో సిరా గుర్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు లేని ప్రాంతాల్లోనే సిరా గుర్తు పద్ధతిని అమలు చేయాలని, మిగితా ప్రాంతాల్లో నిలిపివేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆదేశాలను జారీ చేసింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications